ఇళ్ల పట్టాల పంపిణీపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

తాడేపల్లి:  ఉగాది రోజు పేదలకు ఇళ్లపట్టాల పంపిణీపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి .. మంత్రులు, ఉన్నతాధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. ఉగాది రోజున ఇచ్చే ఇళ్లపట్టాల కోసం భూముల గుర్తింపు పూర్తి కావాలని ఆదేశించారు. జిల్లాల వారీగా ఉన్నతాధికారులు పర్యటించి సమీక్ష చేయాలన్నారు. లక్ష్యాలను చేరుకున్నారా? లేదా? అన్నదానిపై సమీక్ష చేయాలని, ప్రతి జిల్లాలో కనీసం రెండుసార్లు సమీక్షలు చేయాలని సూచించారు. ప్లాట్ల మార్కింగ్‌ జరుగుతుందా? లేదా?, ఇళ్ల పట్టాల కోసం గుర్తించిన భూములను సిద్ధం చేస్తున్నారా? లేదా? అన్నదానిపై సమీక్ష చేయాలన్నారు. ఇళ్లపట్టాల కార్యక్రమం సాఫీగా సాగడానికి అవసరమైతే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు.

Back to Top