ఇడుపులపాయకు చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌

ఘనస్వాగతం పలికిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు

కడప: వైయస్‌ఆర్‌ జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా సీఎం వైయస్‌ జగన్‌ ఇడుపులపాయకు చేరుకున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానం కడప విమానాశ్రయానికి చేరుకున్న సీఎం అక్కడ నుంచి హెలికాప్టర్‌ ద్వారా ఇడుపులపాయకు చేరుకున్నారు. కడప ఎయిర్‌పోర్టులో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైయస్‌ అవినాష్‌ రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి, విప్‌ కొరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు రవీంద్రారెడ్డి, రఘురామి రెడ్డి, మేడా మలికార్జున రెడ్డి, సుధీర్‌ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి, ఎమ్మెల్సీ జకియా, కత్తి నరసింహ రెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, స్థానిక వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు రాత్రి ఇడుపులపాయలోని వైయస్‌ఆర్‌ ఎస్టేట్‌లోనే సీఎం బస చేయనున్నారు.  
 

Back to Top