చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం వైయస్ జగన్
27 Sep 2022 8:22 PM
తిరుమల: కలియుగ దైవం, తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. నుదుటన తిరునామం, సాంప్రదాయ పంచెకట్టు, తలకు పట్టువస్త్రంతో కట్టిన పరివట్టంతో సీఎం వైయస్ జగన్.. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఊరేగింపుగా బయల్దేరి వెళ్లి ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు సీఎం వైయస్ జగన్కు ఆశీర్వచనాలు అందించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సీఎంకు తీర్థప్రసాదాలు అందజేశారు. 2023 తిరుమల తిరుపతి దేవస్థానం క్యాలెండర్ను, డైరీని సీఎం వైయస్ జగన్ ఆవిష్కరించారు. అనంతరం శ్రీవారి పెద్ద శేష వాహన సేవలో పాల్గొన్నారు. అంతకుముందు బేడి ఆంజనేయస్వామిని దర్శించుకొని స్వామివారికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.