వైయస్‌ఆర్‌ జిల్లాకు బయల్దేరిన సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైయస్‌ఆర్‌ జిల్లా పర్యటనకు బయల్దేరారు. సాయంత్రం 4 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌.. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కడపకు బయల్దేరారు. కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న అనంతరం  సాయంత్రం 5.15 గంటలకు ఇడుపులపాయలోని వైయస్‌ఆర్‌ ఎస్టేట్‌కు రోడ్డు మార్గాన వెళ్లనున్నారు. రేపు (సెప్టెంబర్‌–2వ తేదీ) దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి వర్థంతిని పురస్కరించుకుని ఇడుపులపాయలోని వైయస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నివాళులర్పించిన అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు. 

Back to Top