కొప్పర్తి ఇండస్ట్రీయల్‌ పార్కులను ప్రారంభించిన సీఎం

వైయస్‌ఆర్‌ జిల్లా: సీకే దిన్నె మండలంలో కొప్పర్తిలో ఇండస్ట్రీయల్‌ పార్కులను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. కొప్పర్తి సెజ్‌లో రెండు ఇండస్ట్రీయల్‌ పార్కులను వైయస్‌ జగన్‌ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. వైయస్‌ఆర్‌ జగనన్న ఇండస్ట్రీయల్‌ హబ్, వైయస్‌ఆర్‌ ఎలక్ట్రానిక్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌లను సీఎం ప్రారంభించారు. వైయస్‌ఆర్‌ ఎలక్ట్రానిక్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ హబ్‌లో 28 కంపెనీలు రూ.1,052 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువచ్చాయి. కొప్పర్తిలోని ఇండస్ట్రీయల్‌ పార్కులో కంపెనీల రాకతో దాదాపు 14,100 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 
 

Back to Top