నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్‌ జగన్‌

రాజమండ్రి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజమండ్రి కో-ఆర్డినేటర్‌ శివరామ సబ్రహ్మణ్యం కుమార్తె వివాహం రాజమండ్రి మంజీరా ఫంక్షన్‌ హాల్లో  ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరై నూతన వధూవరులు అమృతవల్లి, శ్రీరంగనాథ్‌లను ఆశీ​ర్వదించారు.  ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు మంత్రులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, విశ్వరూప్‌, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ భరత్‌, కాపు కార్పోరేషన్‌ చైర్మన్‌ జక్కంపూడి రాజా తదితరులు హాజరయ్యారు.

Back to Top