ఆ న‌లుగురికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌త్కారం

 
చిత్తూరు: ఇటీవ‌ల సంభ‌వించిన వ‌ర‌ద‌ల‌కు ప్రాణాలు తెగించి స‌హాయ చ‌ర్య‌ల్లో పాల్గొన్న స‌హస వీరుల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌త్క‌రించి, అభినందించారు. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు - పాడీపేట వద్ద స్వర్ణముఖి నదిపై వరద ఉధృతికి కొట్టుకుపోయిన బ్రిడ్జిని ఇవాళ సీఎం శ్రీ వైయస్. జగన్ ప‌రిశీలించారు.  ప్రాణాలకు తెగించి వరద సహాయక చర్యల్లో పాల్గొన్న పోలీసు కానిస్టేబుల్ ప్రసాద్ సహా మరో ముగ్గురు పౌరులను ముఖ్యమంత్రి అభినందించి, ఆ నలుగురిని సత్కరించారు. అనంత‌రం చంద్రగిరి, తిరుపతి రూరల్ మండలాలతో పాటు చంద్రగిరి నియోజకవర్గంలో రహదారులు భవనాలు, వ్యవసాయం, ఉద్యానవన, గృహనిర్మాణం, విద్యుత్ శాఖలకు సంబంధించి వరద నష్టంపై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను  ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ ప‌రిశీలించారు.

Back to Top