ఈ ఒప్పందం చరిత్రాత్మకం

కడప స్టీల్‌ ప్లాంట్‌కు ఐరన్‌ఓర్‌ సరఫరాపై సీఎం సమక్షంలో ఒప్పందం
 

 

తాడేపల్లి: కడప స్టీల్‌ ప్లాంట్‌కు ఐరన్‌ ఓర్‌ సరఫరాపై ఎన్‌ఎండీసీ, రాష్ట్రం ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం చరిత్రాత్మకం అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు పూర్తయ్యాయి. కడప స్టీల్‌ ప్లాంట్‌కు ఐరన్‌ ఓర్‌ సరఫరాపై ఎన్‌ఎండీసీ, రాష్ట్ర ప్రభుత్వ అవగాహన ఒప్పందాలపై ఎన్‌ఎండీసీ డైరెక్టర్‌ అలోక్‌ కుమార్‌ మెహతా, ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌ లిమిటెడ్‌ సీఎండీ పి.మధుసూదన్‌లు సంతకాలు చేశారు. కాగా, ఈ నెల 23వ తేదీన కడప స్టీల్‌ ప్లాంట్‌కు సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం.  కడపలో స్టీల్‌ ప్లాంట్‌తో వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలతో పాటు పరోక్షంగా లక్షల మందికి ఉపాధి లభించనుంది.

Back to Top