పోల‌వ‌రం కీలక పనుల్లో గణనీయ ప్రగతి 

ప్రాజెక్టు వద్ద సమీక్షా సమావేశంలో సీఎంకు వివ‌రించిన అధికారులు

పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌

ఎగువ కాఫర్‌ డ్యాం, దిగువ కాఫర్‌ డ్యాం, దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ వద్ద జరుగుతున్న పనులు.. అన్నింటినీ సమగ్రంగా పరిశీలించిన సీఎం. 

పోలవరం ప్రాజెక్టులో తొలిదశను పూర్తిచేయడానికి అవసరమైన నిధులను ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం తెలిపిందని వెల్లడించిన అధికారులు

ఒక చిన్న సమస్యను విపత్తుగా చూపించే దౌర్భాగ్యమైన మీడియా మన రాష్ట్రంలో ఉంది

రూ.2వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది..ఇది మాత్రం ఎల్లోమీడియాకు కనిపించలేదు:  సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

పోలవరం: పోల‌వ‌రం ప్రాజెక్టు కీలక పనుల్లో గణనీయ ప్రగతి క‌నిపిస్తోంద‌ని అధికారులు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికి వివ‌రించారు. సీఎం వైయ‌స్ జగన్‌ ఏలూరు జిల్లా పోలవరంలో ప‌ర్య‌టించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను సీఎం సమగ్రంగా పరిశీలించారు.  ఎగువ కాఫర్‌ డ్యాం, దిగువ కాఫర్‌ డ్యాం, దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ వద్ద జరుగుతున్న పనులు.. అన్నింటినీ సమగ్రంగా పరిశీలించారు. గత సీజన్లో అనూహ్యంగా వచ్చిన వరద విపత్తును తట్టుకునేందుకు ఎగువ కాఫర్‌ డ్యాం ఎత్తు పెంపు. దీన్నికూడా ముఖ్య‌మంత్రి పరిశీలించారు.  ఆ తర్వాత ఇటీవల నిర్మాణం పూర్తిచేసుకున్న దిగువ కాఫర్‌ డ్యాంను పరిశీలించారు.  గత ప్రభుత్వంలో ప్రణాళిక లోపం వల్ల దెబ్బతిన్న డయాఫ్రంవాల్‌ ప్రాంతాన్ని పరిశీలించారు.  డయాఫ్రం వాల్‌ ప్రాంతంలో కొట్టుకుపోయిన ఇసుకను నింపే పనులను పరిశీలించారు.  వైబ్రో కాంపాక్షన్‌ పనులను పరిశీలించిన సీఎం. 
 డయాఫ్రం వాల్‌ ప్రాంతంలో పునర్‌ నిర్మాణాలు, ఆ తర్వాత ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం నిర్మాణలపై అధికారులతో చర్చించారు. తర్వాత ప్రాజెక్టు వద్ద అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం. ఈ స‌మావేశంలో  పోలవరం ప్రాజెక్టులో కీలక పనుల్లో ప్రగతిని అధికారులు సీఎంకు వివరించారు.
- స్పిల్‌వే కాంక్రీట్ పూర్తయ్యింది.
- 48 రేడియల్‌ గేట్లు పూర్తిస్థాయిలో పెట్టారు.
- రివర్‌ స్లూయిస్‌ గేట్లు పూర్తయ్యాయి.
- ఎగువ కాఫర్‌ డ్యాంకూడా పూర్తయ్యింది.
-  దిగువ కాఫర్ డ్యాం పూర్తయ్యింది.
- గ్యాప్‌ -3 వద్ కాంక్రీట్‌ డ్యాం పూర్తయ్యింది.
- పవర్‌హౌస్‌లో సొరంగాల తవ్వకం పూర్తయ్యింది.
- అప్రోచ్‌ ఛానల్‌ పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయి.
- ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాంలో దెబ్బతిన్న గ్యాప్‌-1 ప్రాంతంలో ఇసుక నింపే కార్యక్రమం పూర్తయ్యింది. ఆప్రాంతంలో వైబ్రో కాంపాక్షన్‌కూడా పూర్తయ్యింది.
- ఈసీఆర్‌ఫ్‌ గ్యాప్‌-2 ప్రాంతంలో నింపడానికి అవసరమైన 100శాతం ఇసుక రవాణా పూర్తయ్యింది.
- ఇక వాటిని నింపే పనులు చురుగ్గా ముందుకు సాగుతున్నాయి. 
- నిర్వాసిత కుటుంబాల్లో 12658 కుటుంబాలను ఇప్పటికే తరలించామని తెలిపిన అధికారులు.


 
పోలవరం తొలిదశ పూర్తికి నిధుల విడుదలపై కేంద్రం అంగీకారం:
- పోలవరం ప్రాజెక్టులో తొలిదశను పూర్తిచేయడానికి అవసరమైన నిధులను ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం తెలిపిందని వెల్లడించిన అధికారులు.
- రూ. 12,911.15 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలుపుతూ కేంద్ర ఆర్థికశాఖ మెమోరాండం జారీచేసిందని, దీన్ని కేంద్ర జలశాఖకు లేఖద్వారా తెలిపిందని వెల్లడించిన అధికారులు.
- గత ప్రభుత్వం ప్రణాళిక లోపం వల్ల దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ ప్రాంతంలో నిర్మాణాలకోసం అదనంగా రూ.2వేల కోట్లు ఇందులో భాగమని వెల్లడించిన అధికారులు.
- కాంపౌండ్ వాల్ బిల్లుల చెల్లింపు వల్ల ప్రాజెక్టు నిర్మాణాలు ఆలస్యం అవుతున్న విషయాన్నిపరిగణలోకి తీసుకుని దానికి కేంద్ర మినహాయింపులు కూడా ఇచ్చిందని తెలిపిన అధికారులు.
- ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంతో నిరంతరాయంగా సంప్రదింపులు, చర్చలు జరిపి, ప్రత్యేక దృష్టిపెట్టడంతోనే ఇది సాధ్యమైందన్న అధికారులు.

గైడ్‌వాల్‌లో చిన్న సమస్యను విపత్తు మాదిరిగా చూపిస్తున్నారు:
- గైడ్‌వాల్‌పై సమీక్షా సమావేశంలో ప్రస్తావన.
- గైడ్‌వాల్‌ డిజైన్లన్నీ కేంద్ర జలసంఘం - సీడబ్ల్యూసీ ఖరారు చేసిందని, వారి ఆమోదంతోనే పనులు చేశామని వెల్లడించిన అధికారులు.
- ప్రస్తుతం వచ్చిన సమస్యను కూడా వారికి నివేదించామని వెల్లడించిన అధికారులు.
- దీన్ని సరిదిద్దడం పెద్ద సమస్యకాదని, సీడబ్ల్యూసీ పరిశీలన కాగానే వారి సూచనల మేరకు వెంటనే మరమ్మతులు చేస్తామని తెలిపిన అధికారులు.

- ప్రాజెక్టు నిర్మాణాల్లో సహజంగానే చిన్న చిన్న సమస్యలు వస్తాయి: సీఎం
- వాటిని గమనించుకుంటూ ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసుకుంటూ ముందుకు సాగుతారు: సీఎం
- పోలవరం ప్రాజెక్టులో ఇలాంటి ఒక చిన్న సమస్యను విపత్తుగా చూపించే దౌర్భాగ్యమైన మీడియా మన రాష్ట్రంలో ఉంది: సీఎం
-  గత ప్రభుత్వం హయాంలో ఎగువ కాఫర్‌ డ్యాంలో ఖాళీలు వదిలేశారు:
- ఈ ఖాళీలగుండా వరదనీరు అతి వేగంతో ప్రవహించడం వల్ల ప్రాజెక్టు నిర్మాణాలకు తీవ్ర నష్టం వాటిల్లింది:
- ఈఎస్‌ఆర్‌ఎఫ్‌ డ్యాం నిర్మాణానికి కీలకమైన డయాఫ్రంవాల్‌ దారుణంగా దెబ్బతింది:
- దీనివల్ల ప్రాజెక్టు ఆలస్యంకావడమే కాదు, రూ.2వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది:
- ఇది మాత్రం ఎల్లోమీడియాకు కనిపించలేదు:
- ఎందుకంటే.. రామోజీరావు బంధువులకే నామినేషన్‌ పద్ధతిలో పనులు అప్పగించేశారు: 
- ప్రాజెక్టు స్ట్రక్చర్‌తో ఏమాత్రం సంబంధం లేనిది గైడ్‌వాల్‌:
- ఇంత చిన్న సమస్యను పెద్ద విపత్తులాగ చూపించే ప్రయత్నంచేస్తున్నారు:
- అయినా దీన్నికూడా పాజిటివ్‌గా తీసుకుని తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవాలి:

డయాఫ్రం వాల్‌ను వీలైనంత త్వరగా పూర్తిచేయాలి: సీఎం
- దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించిన సీఎం.
- ఇది పూర్తైతే మెయిన్‌ డ్యాం పనులు చురుగ్గా కొనసాగడానికి అవకాశం ఉంటుందన్న సీఎం.
- డిసెంబర్‌ కల్లా పనులు పూర్తిచేయడానికి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామన్న అధికారులు.

- నిర్వాసిత కుటుంబాలకు పునరాసంపైనా సీఎం సమీక్ష.
- పునరావాసం కాలనీల్లో అన్ని సామాజిక సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్న సీఎం.
- కాలనీలు ఓవైపు పూర్తవుతున్న కొద్దీ, సమాంతరంగా వీటిని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలన్న సీఎం. 
- నిర్వాసిత కుటుంబాల్లో 12658 కుటుంబాలను ఇప్పటికే తరలించామని తెలిపిన అధికారులు.
- షెడ్యూలు ప్రకారం…, నిర్వాసిత కుటుంబాలను తరలించేలా చూడాలన్న సీఎం.

పోలవరాన్ని మంచి టూరిస్ట్‌ స్పాట్‌గా తీర్చిదిద్దాలి:
- పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని అద్భుతమైన టూరిస్టు ప్రాంతంగా తీర్చిదిద్దాలన్న సీఎం.
- పోలవరం వద్ద మంచి బ్రిడ్జిని నిర్మించాలన్న సీఎం. 
- పర్యాటకులు ఉండేందుకు మంచి సదుపాయాలతో ఇక్కడ హోటల్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్న సీఎం.
- మరిన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటుతో మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న సీఎం.

Back to Top