రేపు పులివెందులకు వైయ‌స్‌ జగన్ 

తాడేపల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించనున్నారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది.  
తన పర్యటనలో భాగంగా వైయ‌స్‌ జగన్‌ మంగళవారం సాయంత్రం పులివెందులకు చేరుకుంటారు. అక్కడ భాకరాపురం క్యాంప్‌ ఆఫీస్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. మరుసటిరోజు(22న) ఉదయం పులి­వెందుల నుంచి బయలుదేరి లింగాల మండలం ఇప్పట్ల వెళతారు. స్థానిక వైయ‌స్ఆర్‌సీపీ నేత సుధాకర్‌ రెడ్డి ఇటీవల‌ మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని వైయ‌స్‌ జగన్‌ ఓదార్చనున్నారు. తిరిగి పులివెందుల క్యాంప్‌ కార్యాలయానికి చేరుకుని ప్ర­జాదర్బార్‌ నిర్వహిస్తారు. 23వ తేదీన ఉదయం పర్యటన ముగించుకుని పులి­వెందుల నుంచి తిరుగు పయనమవుతారు.

Back to Top