ప్రజలంతా సుసంపన్నంగా, సుఖసంతోషాలతో, ఆనందంగా ఉండాలి

రాష్ట్ర ప్రజలకు సీఎం వైయ‌స్‌ జగన్‌ శుభాకాంక్షలు 
 

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు 2022 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుసంపన్నంగా, సుఖసంతోషాలతో, ఆనందంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ నూతన సంవత్సరం ప్రజలకు మరింత ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, సంపదలను అందించాలని అభిలషించారు. రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించి, ప్రజలకు మంచి భవిష్యత్‌ అందించేలా ప్రభుత్వం సంక్షేమ–అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.   

Back to Top