తాడేపల్లి: నవరత్నాలు పథకాలను ప్రమోట్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా శిఖరాలను అధిరోహించిన కర్నూలు పర్వతారోహకుడు జి.సురేష్ బాబుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ‘‘ఆంధ్రప్రదేశ్పై మీ అంకితభావం, ప్రేమ నిజంగా స్ఫూర్తిదాయకం.. మీ మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతున్నా..’’ అంటూ సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు.