ఏపీ కేబినెట్‌ భేటీ ప్రారంభం

సచివాలయం: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లోని మంత్రివర్గ సమావేశ మందిరంలో ఈ సమావేశం జరుగుతుంది. కేబినెట్‌ భేటీలో బడ్జెట్‌ సమావేశాలు, పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. భారీ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డు ప్రతిపాదనలను కేబినెట్‌లో చర్చించి ఆమోదం తెలపనున్నారు. సుమారు రూ.లక్షా 45 వేల కోట్ల పెట్టుబడులకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనుంది. 
 

Back to Top