చంద్రబాబు చిక్కుముడులు విప్పుతున్నాం

మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌, అనిల్‌ కుమార్‌ యాదవ్‌ 

 పోలవరం సవరించిన అంచనాలను ఆమోదించాలని కేంద్రమంత్రికి విన‌తి

  పోల‌వ‌రాన్ని సంద‌ర్శించాల‌ని జ‌ల‌శ‌క్తిశాఖ మంత్రిని కోరాం

ఢిల్లీ : పోలవరంపై 2017లో చంద్రబాబు వేసిన చిక్కుముడులను విప్పుతున్నామని మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌, అనిల్‌ కుమార్‌ యాదవ్ పేర్కొన్నారు. శుక్ర‌వారం పార్టీ ఎంపీల‌తో క‌లిసి ఏపీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌, అనిల్‌ కుమార్‌ యాదవ్   ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రులు మీడియాతో మాట్లాడుతూ..పోలవరం సవరించిన  అంచనాలను ఆమోదించాలని కేంద్రమంత్రికి మెమెరాండం ఇచ్చామని అన్నారు. పోలవరం అంశంపై మంత్రి షెకావ‌త్  పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారని.. పోల‌వ‌రాన్ని సంద‌ర్శించాల‌ని కోరగా.. 15 రోజులలోపే పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తానని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.  మూడు రోజులుగా వివిధ శాఖ‌లకు చెందిన కేంద్ర మంత్రులు, అధికారుల‌తో సమావేశమయ్యాం.నేడు జ‌ల‌శ‌క్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావ‌త్‌ను కలిసి సీఎం వైయస్ జగన్ ఇచ్చిన‌ రిప్ర‌జెంటేష‌న్ అందజేశాం. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాలని కేంద్రమంత్రికి తెలిపాం. పోలవరం ప్రాజెక్టు విషయంలో 2017లో(చంద్రబాబు హయాంలో) జ‌రిగిన పొర‌పాటును, ప్రస్తుతం పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంబంధించిన ఇబ్బందుల‌ను కేంద్ర మంత్రికి వివ‌రించాం.  పోలవరం ప్రాజెక్టులో డ్రింకింగ్ వాట‌ర్ కు సంబంధించి ఏదైతే కాంపోనెంట్ తీసేశారో, దానిని కూడా చట్టంలోని 14-యాక్ట్ ప్ర‌కారం మన‌కున్న హ‌క్కు ప్ర‌కారం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.  ఏపీ విభజన చ‌ట్టంలో జాతీయ ప్రాజెక్టుగా ప్ర‌క‌టించిన పోలవరాన్ని పూర్తి చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యమ‌ని బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి తెలిపారు.  చంద్రబాబు  హయాంలో స్పెషల్ ప్యాకేజీ పేరుతో సెప్టెంబ‌ర్8, 2016న ఒక అగ్రిమెంట్ కుదుర్చుకోవడం వల్ల, ఒరిజ‌న‌ల్ గా ఉన్న ఫెసిలిటీస్ అన్నీ మార్చ‌డం జ‌రిగింద‌న్నారు. దాని వ‌ల్ల క్రియేట్ అయిన ప్రాబ్ల‌మ్సే ఇవన్నీ అన్నారు.  చంద్రబాబు హయాంలో క్రియేట్ చేసిన ప్రాబ్ల‌మ్స్ అన్నింటినీ ఒక చిక్కుముడి మాదిరిగా ఒక్కో ముడినీ తీసుకుంటూ వ‌స్తున్నాం, అందులో భాగంగానే ఈ ఎక్సర్ సైజ్ అంతా అన్నారు.  పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో ముందుకుపోతుంది. అందుకే మా ప్ర‌భుత్వం అత్యధిక ప్ర‌యారిటీ ఇచ్చింద‌ని మంత్రి బుగ్గ‌న తెలిపారు

Back to Top