కూట‌మి అరాచ‌కాల‌ను నిల‌దీద్దాం..నినదిద్దాం

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి పిలుపు

తిరుప‌తి: మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను మాయలోపడేసి అధికారంలోకి వచ్చిన కూట­మి ప్రభుత్వాన్ని నిల‌దీద్దామ‌ని, నిన‌దిద్దామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఏడాదంతా సీఎం చంద్రబాబు ప్రజలను వెన్నుపోటు పొడుస్తూనే పాలన సాగించారని మండిపడ్డారు. బాబు వెన్నుపోటు రాజకీయాలను ఎండగట్టేందుకు ప్రతి ఒక్కరూ రేపు నిర్వ‌హిస్తున్న‌ ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమంలో పాలు­పంచుకోవాలని  ఆయ‌న పిలుపునిచ్చారు. మంగ‌ళ‌వారం తిరుప‌తి న‌గ‌రంలోని పార్టీ కార్యాల‌యంలో భూమ‌న మీడియాతో మాట్లాడారు. వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌ పిలుపు మేరకు జూన్‌ 4న ఏపీవ్యాప్తంగా ‘వెన్నుపోటు’ దినం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆరోజు ప్రజ­లంతా కూటమి మోసాల్ని నిలదీసేందుకు  నియోజకవర్గం కేంద్రాల్లో నిర్వహించే భారీ ర్యాలీకి హాజరై జయప్రదం చేయా­లని కోరా­రు. సీఎం చంద్రబాబు  సూపర్‌ సిక్స్‌తో పాటు 143 హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. ఏడాది గడిచినా ఏ ఒక్క హామీని అమలు చేయకుండా చంద్ర‌బాబు ఇంకా క‌ల్ల‌బొల్లి మాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వెన్నుపోటు దినాన్ని అడ్డుకునేందుకు కూటమి ప్రభు­త్వం కుట్రలకు దిగుతోందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తాము వెన్నుపోటు దినాన్ని ఘనంగా నిర్వహించి, చంద్రబాబు మోసాలను ప్రపంచానికి చాటిచెబుతామని స్పష్టం చేశారు.   

Back to Top