వైయ‌స్‌ జగన్‌ను కలిసిన బంగ్లాదేశ్‌ డిప్యూటీ హైకమిషనర్ షెల్లి సలేహిన్‌

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డిని బంగ్లాదేశ్‌ డిప్యూటీ హైకమిషనర్‌ (చెన్నై, సౌత్‌ ఇండియా) షెల్లి సలేహిన్ క‌లిశారు. ఏపీలో వ్యవసాయం, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన, టెక్నాలజీ వంటి కీలక అంశాలపై ముఖ్యమంత్రితో సెల్లి స‌లేహిన్ చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా షెల్లి సలేహిన్‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ సత్కరించి, జ్ఞాపిక బహుకరించారు.  సమావేశంలో సీఎం స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ పూనం మాలకొండయ్య, బంగ్లాదేశ్‌ డిప్యూటీ హైకమిషనర్‌ కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.

Back to Top