జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
వైయస్ఆర్సీపీ నేతలు,కార్యకర్తలపై మంత్రి పరిటాల వర్గీయుల దాష్టికం
26 Apr 2019 6:23 PM
వేట కోడవళ్లతో దాడి
దాడులకు నిరసనగా వైయస్ఆర్సీపీ ఆందోళన
టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరాంను అరెస్ట్చేయాలని డిమాండ్
పరిటాల వర్గీయుల ఆగడాలపై పోలీసుల ప్రేక్షక పాత్ర
అనంతపురం: మంత్రి పరిటాల వర్గీయులు ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. చెన్నెకొత్తపల్లి మండలం నాగసముద్రంలో పరిటాల వర్గీయులు వైయస్ఆర్సీపీ నేతలు,కార్యకర్తలపై వేట కోడవళ్లతో దాడికి పాల్పడారు.ఈ ఘటనలో నలుగురు వైయస్ఆర్సీపీ కార్యకర్తలకు తీవ్రగాయపడ్డారు.ఎన్నికల్లో టీడీపీకి సహకరించని వారిపై కూడా దాడులకు పాల్పడ్డారు. బీసీలను పరిటాల వర్గీయులు టార్గెట్ చేశారు.
రాప్తాడు టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరాం ఆదేశాలతో దాడులు చేశామని నిందితులు చెబుతున్నారు. పరిటాల వర్గీయులు దాడులకు నిరసనగా ఎస్ఎస్ గేట్ వద్ద వైయస్ఆర్ కాంగ్రెస్ నేతలు,కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దౌర్జన్యాలు చేస్తున్న పరిటాల శ్రీరాంను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా పోలీసులకు, వైయస్ఆర్సీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రి పరిటాల వర్గీయుల ఆగడాలపై పోలీసుల ప్రేక్షక పాత్ర వహించడం పట్ల వైయస్ఆర్సీపీ నేతలు,కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దాడులకు పాల్పడిన పరిటాల వర్గీయులను ఎస్ఐ రఫీ వదిలివేయడం పట్ల వైయస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు