మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
టీడీపీ దిక్కుతోచని పరిస్థితిలో పడింది
08 Jun 2020 2:06 PM
ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా
కాకినాడ: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలనతో ప్రజల మన్ననలు పొందారని, దీంతో టీడీపీ దిక్కుతోచని పరిస్థితిలో పడిందని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా అన్నారు. వచ్చే ఎన్నికల్లో 23 సీట్లు కూడా రావని టీడీపీకి అర్థమైందన్నారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనుకూల మీడియాను అడ్డం పెట్టుకొని ప్రభుత్వంపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని, వైయస్ఆర్ సీపీ మేనిఫెస్టోను విమర్శించేస్థాయికి చంద్రబాబు దిగజారాడన్నారు. ఏడాది పాలనలోనే మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను సీఎం వైయస్ జగన్ అమలు చేశారని, మిగిలిన 10 శాతం కూడా ఎప్పుడు పూర్తి చేస్తామో సీఎం వెల్లడించారన్నారు. ఏ నెలలో.. ఏ పథకం అమలు చేస్తామో తేదీల వారీగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ సంక్షేమ పథకాల క్యాలెండర్ విడుదల చేశారని గుర్తుచేశారు.
తుని ఆక్వాజోన్లో చంద్రబాబు తన బినామీ కంపెనీలు అయిన దివిస్ పరిశ్రమను తీసుకొచ్చే ప్రయత్నం చేశాడని దాడిశెట్టి రాజా మండిపడ్డారు. ఆక్వారంగం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. కరోనా కష్టకాలంలోనూ ఆక్వారంగాన్ని సీఎం వైయస్ జగన్ ఆదుకున్నారని, ఆక్వా ఉత్పత్తులకు మద్దతు ధర అందించి రైతులకు తోడుగా నిలిచారన్నారు.