సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
పోలీసుల మృతి పట్ల సీఎం వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
23 Aug 2021 5:03 PM
తాడేపల్లి: శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏఆర్ పోలీసుల దుర్మరణంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదేవిధంగా ప్రమాద ఘటనపై డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తీవ్ర తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ అమిత్ బర్డార్ తో ఫోన్లో మాట్లాడి తెలుసుకున్నారు. ఏఆర్ కానిస్టేబుళ్లు విధి నిర్వహణలో భాగంగా ప్రతిరోజూ తనకు ఎస్కార్ట్ గా వస్తున్న విషయాన్ని గుర్తు చేసుకుని ధర్మాన కృష్ట దాస్ బాధ పడ్డారు. మరోవైపు ప్రమాద ఘటనా స్థలానికి మంత్రి సీదిరి అప్పల రాజు హుటాహుటిన చేరుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.