వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ఈనెల 24 వరకు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
14 Mar 2023 12:32 PM
బీఏసీ సమావేశంలో నిర్ణయం
అమరావతి: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన ప్రారంభమైన బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 24వ తేదీ వరకు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. తొమ్మిది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈనెల 16వ తేదీన శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. సమావేశానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి, చీఫ్ విప్ ప్రసాదరాజు, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, జోగి రమేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి, ప్రతిపక్ష సభ్యులు అచ్చెన్నాయుడు హాజరయ్యారు.