మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
సీఎం వైయస్ జగన్ మంచి పనులు చేస్తుంటే ఓర్వలేకపోతున్నారు
07 Sep 2020 5:10 PM
అబద్ధాలు ప్రచారం చేయడంలో చంద్రబాబు దిట్ట
త్వరలోనే ఉత్తరాంధ్ర సృజల స్రవంతి పూర్తి చేస్తాం
రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
తాడేపల్లి: సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మంచి పని చేస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మంత్రి అనిల్కుమార్ యాదవ్ విమర్శించారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాలను సస్యశ్యామలం చేయాలని రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రవేశ పెడుతున్నామని చెప్పారు. సోమవారం అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వర్షాలు పుష్కలంగా పడ్డాయన్నారు. 81 శాతం రిజార్వయర్లు నిండాయని చెప్పారు. అబద్ధాలు ప్రచారం చేయడంలో చంద్రబాబు దిట్ట. గండికోట ప్రాజెక్టు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పూర్తి చేశారన్నారు.
ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకపోవడం వల్లే..
గత ఐదేళ్లలో చంద్రబాబు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి కింద రిలీజ్ చేసింది ఎంత. చంద్రబాబు గండికోటకు ఈ ప్యాకేజ్ కింద నిధులు విడుదల చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. చంద్రబాబు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకపోవడం వల్లనే 26 టీఎంసీల నీటిని నిల్వ చేయలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద గండికోటకు 972 కోట్ల రూపాయలు ప్రకటించారు. వాటిలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద 676 కోట్లు విడుదల చేశారు. మిగతా 296 కోట్ల రూపాయలను త్వరలో విడుదల చేస్తాము. గండికోట గురించి మాట్లాడడానికి చంద్రబాబుకు సిగ్గుండాలి. సీఎం జగన్కు మంచి పేరు వస్తుందని చంద్రబాబు కొంతమందిని రెచ్చగొడుతున్నారు’ అని అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వర్షాలు పడకూడదని కోరుకునే వ్యక్తి చంద్రబాబు..
వర్షాలు పడకూడదని దేవుడుని కోరుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. చంద్రబాబు విజయవాడకు చుట్టపు చూపుగా వస్తున్నారు. ఆరు నెలల్లో చంద్రబాబు పట్టుమని పది రోజులు కూడా అమరావతిలో ఉండలేదు. ఉత్తరాంధ్ర సృజల స్రవంతిని త్వరలో పూర్తి చేస్తాము. పల్నాడులో 1500 కోట్ల రూపాయలతో ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేస్తున్నాము. కృష్ణ నది ప్రకాశం బ్యారేజీ దిగువన మరో రెండు బ్యారేజీలు నిర్మిస్తున్నాము. 2 లక్షల 70 కోట్ల అప్పు చేసింది చంద్రబాబు నాయుడు.70 వేల బిల్లులు పెండింగ్ లో చంద్రబాబు పెట్టారు. చంద్రబాబు పెట్టిన బకాయిలు మేము చెల్లిస్తున్నామని మంత్రి అనిల్ కుమార్ తెలిపారు.