నేడు వైయ‌స్ఆర్‌సీపీ ‘యువతపోరు’..

అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరసనలు

అనంతరం కలెక్టర్లకు వినతిపత్రం సమర్పించాలని నిర్ణయం

అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ చంద్రబాబు హామీ

ఉద్యోగాలు కల్పించకపోతే నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి అంటూ హామీ

ఇప్పటికి ఏడాదైనా కనీసం జాబ్ కేలండర్ కూడా ప్రకటించని చంద్రబాబు సర్కార్

నిరుద్యోగ భృతి ఊసే ఎత్తని కూటమి ప్రభుత్వం

నిరుద్యోగ భృతి రూపంలో ఇప్పటికే రూ.7,200 కోట్ల బకాయి

2025-26 బడ్జెట్లోనూ నిరుద్యోగ భృతికి పైసా కేటాయించని చంద్రబాబు

చంద్రబాబు మోసాన్ని నిరసిస్తూ నేడు వైయ‌స్ఆర్‌సీపీ ఆందోళనలు

కలెక్టరేట్ల ఎదుట భారీ నిరసన కార్యక్రమాలకు పిలుపు 

తాడేప‌ల్లి: ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలంటూ చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షమైన వైయ‌స్ఆర్‌సీపీ ఒత్తిడి పెంచుతోంది. వివిధ అంశాలపై ఇప్పటికే నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టిన వైయ‌స్ఆర్‌సీపీ ఈసారి యువత కోసం ఆందోళనలు చేపడుతోంది. మాట తప్పి.. వెన్ను­పోటు పొడిచిన కూటమి ప్రభుత్వ తీరుకు రాష్ట్రవ్యాప్తంగా యువ­తకు బాసటగా జిల్లా కలెక్టరేట్‌ల వద్ద ఆందోళనలకు వైయ‌స్ఆర్‌సీపీ యువజన విభాగం పిలుపునిచ్చింది. అనంతరం యువతకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టర్‌లకు యువతీయువకులతో కలిసి వైయ‌స్ఆర్‌సీపీ యువజన విభాగం నేతలు వినతిపత్రాలు అందించనున్నారు.   

కృతి లేదు.. భృతి లేదు 
2014 ఎన్నికల్లో ఇంటికో ఉద్యోగం లేదా ఉద్యోగం వచ్చే వరకూ యువతీ యువకులకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతిగా ఇస్తానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హామీ ఇచ్చారు. చేయడానికి పని (కృతి) కల్పించకపోగా.. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకుండా మోసం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ మళ్లీ అదే హామీని చంద్రబాబు ఇచ్చారు. సూపర్‌ సిక్స్‌ పథకాల్లో భాగంగా 20 లక్షల ఉద్యోగాలు.. ఉద్యోగాలు వచ్చే వరకూ నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు.

నో జాబ్స్‌..
ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి.. ఉద్యోగాలను భర్తీ చేస్తామని వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇప్పటివరకూ ని­రు­ద్యోగ భృతిని ఏ ఒక్కరికీ అందించలేదు. ఒక్కొక్కరికి నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలను నిరుద్యోగ భృతిగా చెల్లించాలి. కానీ.. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నిరుద్యోగ భృతి చెల్లించలేదు. అంటే.. ఇప్పటికే నిరుద్యోగ భృతి రూపంలో 2 లక్షల మందికి రూ.7,200 కోట్లను ప్రభుత్వం బకాయిపడింది. 2025–26 సంవత్సరంలోనూ నిరుద్యోగ భృతికి ఒక్క పైసా కూడా కేటాయించలేదు. అంటే.. ఈ ఏడాదికి కూడా ఒక్కరికీ నిరుద్యోగ భృతి ఇవ్వరనే విషయం స్పష్టమవుతోంది.  

అమలు చేసేశామంటూ అబద్ధాలు 
నిరుద్యోగ భృతిని స్కిల్‌ డెవలప్‌మెంట్‌తో అనుసంధానం చేశామని.. అందువల్ల ఆ హామీని అమలు చేసేశామని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. ఇంకా ఎవరైనా ఆ హామీ అమలుపై ప్రశ్నిస్తే వారికి తోలు మందం తప్ప మరొకటి కాదని వ్యా­ఖ్యానించారు. మరో­వైపు కాలేజీలకే ఫీజు రీయిం­బర్స్‌­మెంట్‌ రుసుము చెల్లించి విద్యార్థులకు చిక్కులు లేకుండా చూస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రుసుం చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా­రు.

తమ పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అధి­క వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితి దాపురించింది. 6 త్రైమాసికాలకు రూ.­4,200 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద విద్యార్థులకు ఇవ్వాలి. వసతి దీవెన కింద రూ.2,200 కోట్లు ఇవ్వాలి. అంటే ఈ రెండు పథకాల కింద రూ.6,400 కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.750 కోట్లు మాత్రమే ఇచ్చి విద్యార్థులను నట్టేట ముంచేశారు. ఇక అంబేడ్కర్‌ విదేశీ విద్యా పథకం కింద ఏ ఒక్కరికీ ఇప్పటిదాకా సాయం అందించలేదు.  

Back to Top