నేనున్నానంటూ...

ప్రజల కష్టాలు పట్టని టీడీపీ సర్కార్
అనంతలో ఆత్మహత్యలపై జననేత కలవరం
రైతు, చేనేత కుటుంబాలకు పరామర్శ
బాధితులకు కొండంత భరోసా

అనంతపురంః
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజల కష్టాలు
చూసి చలించిపోయారు. అనంతలో అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న రైతు,
చేనేత కుటుంబాలను  వైఎస్ జగన్ పరామర్శించారు. ఈసందర్భంగా వారు పడుతున్న
బాధలు, వారి కుటుంబ పరిస్థితులు ప్రతిది అడిగి తెలుసుకున్నారు. ఇంటి పెద్ద
దిక్కుకోల్పోయిన బాధితులకు పెద్దన్నగా వైఎస్ జగన్ ఆపన్న హస్తం అందించారు.
 ఆదుకునేందుకు వచ్చిన జననేతకు ....తమ వేదనను చెప్పుకొని వారు కన్నీటి
పర్యంతమయ్యారు. ఏ కుటుంబాన్ని కదిలించినా ఒకటే బాధ. ఒకటే ఆవేదన..

ఆత్మహత్య
చేసుకున్న రైతు, చేనేత కుటుంబాల వద్దకు వెళ్లిన జననేతను చూసి బాధితులు
కన్నీరుమున్నీరయ్యారు. తమ వారిని కోల్పోయి నిండు దుఖంలో ఉన్న ఆకుటుంబాలను
పెదన్నగా వైఎస్ జగన్ వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు.  పిల్లలను దగ్గరకు
తీసుకొని ఓదార్చారు.  ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు. అప్పు ఎంత ఉంది?
మాఫీ ఎంత అయ్యింది? ప్రభుత్వం నుంచి అసలు పరిహారం అందిందా?’ లేదా అన్నది
వైఎస్ జగన్ బాధితులను ప్రతిది వివరంగా అడిగారు.

రుణాలు
మాఫీ కాక, బ్యాంకులో బంగారం ఇంటికి రాక...బ్యాంకర్ల వేధింపులు తాళలేక,
భర్తలు చనిపోయి తాము పడుతున్న ఇబ్బందులను వారు వైఎస్ జగన్ కు విన్నవించారు.
చంద్రబాబు మాటలు నమ్మి తీసుకున్న రుణాలు చెల్లించకపోవడంతో కష్టాలు
పడుతున్నామని,..తాకట్టు పెట్టిన బంగారు రుణాలు చెల్లించాలంటూ నోటీసులు
వచ్చాయని వారు వివరించారు. డ్వాక్రా రుణాలపై వడ్డీ మీద వడ్డీ వేశారని,
వితంతు పింఛన్లు ఇవ్వకుండా తిప్పుకుంటున్నారని...చంద్రబాబు తమను నమ్మించి
మోసం చేశారని ప్రజలు, బాధితులు వాపోయారు. రైతులు, చేనేతలు, డ్వాక్రామహిళల
రుణాలన్నీ మాఫీ చేస్తాం..అప్పటివరకు బ్యాంకులకు ఎవరూ రుణాలు కట్టొద్దంటూ
బాబు ఎన్నికల ముందు గొప్పగా హామీలు గుప్పించారు. 

చంద్రబాబు
నిర్వాకం వల్లే ఇవాళ రాష్ట్రంలో ఈపరిస్థితి వచ్చిందని వైఎస్ జగన్
ధ్వజమెత్తారు. ‘నేను వస్తున్నానని తెలిసే వాళ్లు ఆర్థిక సాయం ఇస్తామని
చెబుతుంటారు తల్లీ. తీరా నేను వెళ్లిపోయాక సమస్య మళ్లీ మొదటికొస్తుంది’ అని
వైఎస్ జగన్ వారితో  అన్నారు.  త్వరలోనే మంచి రోజులు వస్తాయి తల్లీ..
అంతవరకు ఓపికపట్టండి. ఈ ప్రభుత్వం మీకు సాయం చేయకపోయినా మా ప్రభుత్వం
వచ్చాక మీకు ఆర్థిక సాయం అందిస్తాం. పింఛన్లపై కోర్టులో కేసు వేసి మీకు
న్యాయం జరిగేలా చూస్తా.’ అంటూ వారందరికీ జననేత భరోసా ఇచ్చారు.
ప్రజాసమస్యలపై ప్రతిపక్ష వైఎస్సార్సీపీ పోరాడితే తప్ప ప్రభుత్వానికి
ఏమాత్రం చలనం లేకపోవడం దురదృష్టకరం. 
 
వైఎస్ జగన్
ఈనెల ఆరు నుంచి 12వ తేదీ వరకు మొత్తం వారం రోజులు అనంతపురం జిల్లాలో నాలుగో
విడత రైతు భరోసా యాత్ర చేశారు. ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో
విస్తృతంగా పర్యటించారు. టీడీపీ సర్కార్ నిర్లక్ష్యం కారణంగా జిల్లాలో
ఆత్మహత్య చేసుకున్న 28 మంది రైతు, చేనేత కుటుంబాలను జననేత పరామర్శించారు.
అదేవిధంగా తాను వెళ్లిన ప్రతి చోట రైతులు, కూలీలు, నిరుద్యోగులు, ఉద్యోగులు
అంతా తమ సమస్యలు చెప్పుకొన్నారు. మొద్దు నిద్ర వహిస్తున్న సర్కార్ పై
ఒత్తిడి తేవాలని విన్నవించుకున్నారు. ప్రజల సాధకబాధలను సావధానంగా విన్న
వైఎస్ జగన్ న్యాయం కోసం ప్రభుత్వంపై పోరాడుదామని వారికి హామీ ఇచ్చారు. 
Back to Top