తూర్పుగోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి పెద్దాపురం పట్టణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు జననేతకు ఘన స్వాగతం పలికారు. పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వేలాదిగా జనం తరలిరావడంతో పోటెత్తింది. అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్ జగన్ ప్రసంగించనున్నారు.