<br/>పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పెదతాడేపల్లి గ్రామానికి చేరుకున్న వైయస్ జగన్కు పార్టీ నాయకులు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు తమ రుణాలు మాఫీ కాలేదని జననేతకు ఫిర్యాదు చేశారు. వారికి వైయస్ జగన్ నవరత్నాల గురించి వివరించారు.