ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై కేంద్రాన్నిఎందుకు ప్రశ్నించరు

వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత  

తాడేప‌ల్లి: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై కేంద్ర ప్ర‌భుత్వాన్ని చంద్ర‌బాబు, ప‌వ‌న్ ఎందుకు ప్రశ్నించర‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత  నిల‌దీశారు. చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించరు.అసత్య ఆరోపణలు చేసి ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాలని చూస్తున్నారు.భూ యాజమానుల అభిప్రాయం తీసుకునే రీ సర్వేలు చేస్తున్నారు.అసత్య ఆరోపణలు చేస్తున్న చంద్రబాబుకూ సవాల్ విసురుతున్నా.అమరావతి పేరు చెప్పి చంద్రబాబు భూ కుంభకోణాలకు పాల్పడ్డారు.అందుకే ప్రజలు చంద్రబాబును చెత్తబుట్టలో వేశారు.

రాజధానిలో చుక్కల భూములు రైతులు అమ్ముకోకుండా 22 ఏ జాబితాలో చేర్చిన వ్యక్తి చంద్రబాబు.
అసైన్డ్ భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి దళితుల భూములను కాజేసిన చరిత్ర తెలుగుదేశం నేతలదే.టీడీపీ చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. స్కామ్ లకు పాల్పడిన నేపధ్యంలో 2019 లో ప్రజలు బుద్ధి చెప్పినా చంద్రబాబు తీరు మారడం లేదు. అవ్వా తాతల పెన్షన్లు అడ్డుకోవడమే కాక దొంగే దొంగా దొంగా అని అరిచినట్లు ఎన్నికల కమిషన్ కు పిర్యాదు . పెన్సన్ ల విషయంలో చేయ్యాల్సిన కుట్రలు అన్నీ చేసి చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారు. చంద్ర‌బాబును ప్రజల నమ్మడం లేదు.కనుక ప్రస్టేషన్ లో ప్రభుత్వంపై,జగన్ గారిపై దుష్ప్రచారం చేస్తున్నారు 

Back to Top