తూర్పు గోదావరి: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జననేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పు గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. రాజన్న బిడ్డ పాదయాత్ర కేతరాజుపల్లికు చేరుకుంది. ఈ సందర్భంగా జననేతకు స్థానికులు, పార్టీ నాయకులు ఆత్మీయ స్వాగతం పలికారు. కుటీర పరిశ్రమలను ఆదుకోవాలని స్థానికులు వినతిపత్రం అందజేశారు.