<br/>కర్నూలు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా సాగుతోంది. మరికాసేపట్లో వైయస్ జగన్ పాదయాత్ర 300 కిలోమీటర్ల మైలు రాయిని చేరుకుంటారు. బుధవారం సాయంత్రం కారుమంచి గ్రామ శివారులో వైయస్ జగన్ 300 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి అవుతుంది. ఈ సందర్భంగా ఆయన కారుమంచి గ్రామంలో మొక్కలు నాటుతారు.