ఒంగోలు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగులకు అండగా ఉంటుందని పార్టీ జాతీయ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. పాదయాత్రలో తనను కలిసిన దివ్యాంగుల చిన్నారులను ఆప్యాయంగా పలుకరించిన వైయస్ జగన్ త్వరలో మంచి రోజులు వస్తాయని భరోసా ఇచ్చారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉచితంగా విద్యనందించడంతో పాటు దివ్యాంగులకు రూ.3వేలు పింఛన్ ఇస్తామన్నారు. చిన్నారులు బాగా చదువుకుని తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలన్నారు.