<br/>విశాఖ: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. 263వ రోజు పాదయాత్ర షెడ్యూల్ను వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. ఆదివారం ఉదయం పెందుర్తి నియోజకవర్గంలోని బస చేసే ప్రాంతం నుంచి జననేత పాదయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి పెందుర్తి మండలం ఎస్ఆర్ పురం కాలనీ, అనంతరం భీమిలి నియోజకవర్గంలోని ఆనందాపురం మండలం దద్దాండ క్రాస్, ఎస్ఆర్ పురం క్రాస్, సత్తారువు వరకు కొనసాగుతుంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం తిరిగి పాదయాత్ర ప్రారంభమవుతుంది. భీమిలి నియోజకవర్గంలోని బొంతువానిపాలెం, సొంట్యమ్ జంక్షన్, దిబ్బడి పాలెం జంక్షన్, గుమ్మడివానిపాలెం వరకు వైయస్ జగన్ పాదయాత్ర కొనసాగుతుంది.