బొగ్గాలపల్లి నుంచి ప్రజాసంకల్పయాత్ర

అనంతపురం :  వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 42వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర బుక్కపట్నం మండలం బొగ్గాలపల్లి నుంచి  ప్రారంభ‌మైంది.  అక్క‌డి నుంచి కదిరి నియోజకవర్గం యాకాల చెరువు కొత్తపల్లి, కొండమనాయుని పల్లి, వరిగిరెడ్డిపల్లి, గట్లు క్రాస్‌ రోడ్డు, పార్థసారధి కాలనీ మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. అనంతరం 2.45 గంటలకు వీవర్స్‌ కాలనీ నుంచి మళ్లీ పాదయాత్ర కొనసాగుతుంది. కోనేరు సర్కిల్‌, క్లాక్‌ టవర్‌ సర్కిల్‌ మీదుగా ఇందిరా సర్కిల్‌కు చేరుకుని అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాత్రికి ఇక్కడే బస చేస్తారు.



Back to Top