అనంతపురం: వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో తలపెట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని మైనారిటీలు శనివారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ధర్మవరం మండలం చిగిచెర్ల వద్ద మైనారిటీ నేతలు వైయస్ జగన్ను కలిసి ఆయన్ను సత్కరించారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మన ప్రభుత్వం వచ్చాక ముస్లిం సోదరులకు న్యాయం జరుగుతుందని వైయస్ జగన్ హామీ ఇచ్చారు.