అనంతపురం: తమను ఎస్సీలుగా గుర్తించి కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని బుడగ జంగాల కులస్థులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కోరారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గురువారం కల్లుమడి గ్రామంలో బుడగజంగాలులు వైయస్ జగన్ను కలిశారు. ఈ సందర్భంగా తమ పిల్లలను చదివించుకోవాలంటే ఏ కులమని అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు స్పందించిన వైయస్ జగన్ మన ప్రభుత్వం వచ్చాక అందరికి న్యాయం చేస్తామన్నారు.