వైయస్‌ జగన్‌కు ఏపీసీపీఎస్‌ ఉద్యోగుల వినతి

ప్రకాశం:

తప్పుడు హామీలిచ్చి చంద్రబాబు తమను మోసం చేశాడని ఏపీసీపీఎస్‌ ఉద్యోగులు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యను చెప్పుకున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం టకారిపాలెం వద్ద వైయస్‌ జగన్‌ను కలుసుకొని తమ సమస్యలపై జననేతకు వినతిపత్రం అందజేశారు. అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తానని వైయస్‌ జగన్‌ వారికి హామీ ఇచ్చారు.

Back to Top