మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
బాబు హామీలు మోసపూరితం
17 Feb 2017 5:40 PM
గొల్లప్రోలు: చంద్రబాబు బూటకపు హామీలు నమ్మి మోసపోయామని ప్రజలంతా ముక్తకంఠంతో చెబుతున్నారని వైయస్ఆర్ సీపీ నేత పెండెం దొరబాబు ధ్వజమెత్తారు. మూడేళ్లుగా ఇళ్లు లేవు..ఫించన్లు లేవు. కనీసం తాగడానికి కూడా నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని గొల్లప్రోలుని పాపాయ్యచావిడి ప్రాంతానికి చెందిన ప్రజలు దొరబాబుకు తమ గోడు వినిపించారు. వైయస్ఆర్ సీపీ కన్వీనర్ పెండెం దొరబాబు గడపగడపకూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. బాబు మోసాలపై రూపొందించిన కరపత్రాలను ఇంటింటా పంచుతూ బాబు అబద్ధపు హామీలను ఆయన ప్రజలకు వివరించారు. టీడీపీ నాయకులు జన్మభూమి కమిటీల పేరుతో పేదలకు అందించాల్సిన పించన్లను పక్కదారి పట్టిస్తున్న వైనాన్ని వివరించారు. ప్రజాసమస్యలపై పోరాడేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉందన్నారు. ప్రజా పరిపాలన కావాలంటే వైయస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని సూచించారు. కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.