మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
వైయస్ఆర్కు వీరప్ప మొయిలీ నివాళులు
02 Sep 2012 1:47 AM
హైదరాబాద్, 2 సెప్టెంబర్ 2012 : దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మూడవ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ ఆదివారం ఉదయం హైదరాబాద్లో నివాళులు అర్పించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ సిటి సెంటర్ వద్ద ఉన్న వైయస్ఆర్ విగ్రహానికి మొయిలీ పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేవీపి రామచంద్రరావు, దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ స్మృతులను మొయిలీ గుర్తు చేసుకున్నారు. స్వర్గీయ వైయస్ఆర్ జ్ఞాపకాలు ఎప్పటికీ తమతో ఉంటాయని ఆయన అన్నారు.
వైయస్ రాజశేఖరరెడ్డి లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి దానం నాగేందర్ పేర్కొన్నారు. గాంధీ కుటుంబం తరువాత కాంగ్రెస్ పార్టీలో గొప్ప నేతగా వైయస్ఆర్ గుర్తింపు తెచ్చుకున్నారని ఆయన అంజలి ఘటించారు.
పంజాగుట్ట వద్ద వైయస్ఆర్ విగ్రహానికి కిరణ్ పుష్పాంజలి :
పంజాగుట్టలోని స్వర్గీయ ప్రజా నేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఎంపీలు కేవీపీ, అంజన్కుమార్ యాదవ్, ఉండవల్లి అరుణ్కుమార్, మంత్రులు వట్టి వసంత్కుమార్, కాసు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.