బీఏసీ నుంచి వైయస్ఆర్‌ కాంగ్రెస్ వాకౌ‌ట్

హైదరాబాద్‌ :

అసెంబ్లీ సమావేశాల్లో సమైక్య తీర్మానం ప్రవేశపెట్టాలన్న తమ ప్రతిపాదనకు ప్రభుత్యం వ్యతిరేకత తెలపడంతో శాసనసభా వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశంను తాము వాకౌట్ చేసినట్లు వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ‌ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ‌తెలిపారు. బీఏసీ సమావేశం ముగిసిన తరువాత శ్రీమతి విజయమ్మ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచాలన్న తీర్మానం శాసనసభలో ప్రవేశపెట్టాలని తాము డిమాండ్ చేశామని చెప్పారు. తమ డిమాండ్‌ను ప్రభుత్వం తిరస్కరించడంతో తాము బయటకు వచ్చినట్లు తెలిపారు.

తాము సమైక్య తీర్మానం ప్రవేశపెడతామని, ఎవరు మద్దతు తెలిపినా తాము స్వీకరిస్తామని మీడియా అడిగి ఒక ప్రశ్నకు బదులుగా శ్రీమతి విజయమ్మ చెప్పారు. అన్ని సమస్యల కంటే విభజనే అతిపెద్ద సమస్య అని ఆమె తెలిపారు. తుపాన్ల నష్టాలు, కరెంట్ కష్టాలు, కృష్ణా ట్రిబ్యున‌ల్ తీర్పు అంశాలపై చర్చకు కూడా డిమాండ్ చేసినట్లు వివరించారు. ప్రజా‌ సమస్యలపై చర్చకు కిరణ్ ప్రభుత్వం‌ ఏమాత్రం సిద్ధంగా లేదని శ్రీమతి విజయమ్మ విమర్శించారు.

Back to Top