రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
ప్రజల ఆశాజ్యోతి వైయస్ జగన్..
27 Nov 2018 11:50 AM
శ్రీకాకుళంఃమూడు పంటలు పండించుకునే రైతులు ఒక పంట మాత్రమే పండించుకునే దుస్థితికి టీడీపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే కళావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటికి కూడా చంద్రబాబు నాయుడు రైతులను మోసగించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడని విమర్శించారు.తిత్లీ తుపాన్ నష్టపరిహారం కూడా రైతులకు పూర్తిగా అందలేదని, పచ్చచొక్కాల జేబుల్లోకి వెళ్ళాయని మండిపడ్డారు. డ్వాక్రా వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తున్నారన్నారు.కేంద్రపథకాలను కూడా టీడీపీ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారన్నారు. రైతులు చంద్రబాబును నమ్మే పరిస్థితులు లేవన్నారు.వైయస్ఆర్ బతికుంటే మాకు ఈ దుస్థితి ఉండేందికాదని ప్రజలు అంటున్నారన్నారు. దివంగత నేత వైయస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మేలు చేస్తారని పూర్తి విశ్వాసంతో ప్రజలు ఉన్నారన్నారు.ప్రజలందరూ పాదయాత్రకు తరలివస్తున్నారన్నారు.