హైదరాబాద్: ఐటీ సోదాలు సర్వసాధారణమని, ఈ దాడులపై చంద్రబాబుకు ఎందుకు భయపడుతున్నారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు. ఐటీ దాడుల అంశాలను కేబినెట్ సమావేశంలో చర్చించడం చంద్రబాబు ప్రభుత్వంలోనే చూస్తున్నామన్నారు. ఐటీ దాడులను కూడా రాజకీయంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజల్లో లేనిపోని భయాలు సృష్టిస్తున్నారని తప్పుపట్టారు.<br/>