టీడీపీ అధికార దురంహకారం

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలను అన్ని విధాలుగా మోసం చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. జాబు రావాలంటే బాబు రావాలని గొప్పలు చెప్పిన చంద్రబాబు...అధికారంలోకి వచ్చాక ఉన్న  ఉద్యోగాలు పీకేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీడీపీ పాలన పూర్తిగా వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు. 

సింగపూర్, జపాన్ అంటూ చంద్రబాబు ప్రచార ఆర్భాటాలతో ప్రజలను మోసపుచ్చుతున్నారని నేతలు నిప్పులు చెరిగారు. వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతూ చంద్రబాబు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఫైరయ్యారు. తామేం  చేసినా చెల్లుతుందన్న అధికార దురంహకారంతో టీడీపీ సర్కార్ పాలన సాగించడం దుర్మార్గమన్నారు. రానున్న రోజుల్లో  చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
Back to Top