వైయస్‌ జగన్‌తోనే అభివృద్ధి సాధ్యం..

వైయస్‌ఆర్‌సీపీ నేత తమ్మినేని సీతారాం...
శ్రీకాకుళంః ఆమలదాలవలసను అభివృద్ధి చేస్తామని చెప్పి ఎన్నో హామీలిచ్చి ఒకటి చేయలేదని వైయస్‌ఆర్‌సీపీ నేత తమ్మినేని సీతారాం అన్నారు.చెరుకు రైతులకు కల్పతరువు లాంటి షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చి నేటి వరుకూ చర్యలు తీసుకోలేదన్నారు. చెరుకు రైతులు నిరాశలో కూరుకుపోయారన్నారు.ఆమదాలవలస వాణిజ్య కేంద్రం అని దానిపై కూడా ప్రభావం పడిందన్నారు. ఇండిస్ట్రియల్‌ పార్క్‌ అంటూ కలబొల్లి మాటలు చెప్పారన్నారు.100 ఎకరాలు విలువ చేసే భూమిని ఆరుకోట్ల రూపాయలకు అమ్ముకున్నారని, డిపాజిట్లు కూడా చెల్లించకుండా ఎలా అమ్ముతారని రైతులు కోర్టుకు వెళ్ళారన్నారు. కోర్టు రైతులకు అనుకూలంగా స్పష్టంగా తీర్పు చెప్పిందన్నారు. నాలుగేళ్లుగా ఆమదాలవలసలో అభివృద్ధి లేదన్నారు.ప్రభుత్వం చేతగానితనం వల్లన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.వైయస్‌ జగన్‌ వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.   
Back to Top