<br/>హైదరాబాద్: టీడీపీ, బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం కుదురినట్లు కనిపిస్తుందని వైయస్ఆర్సీపీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం విషయంలో బీజేపీ, టీడీపీల ధోరణి బయటపడిందన్నారు. అందర్ని కలుపుకునిపోయే ప్రయత్నం చంద్రబాబు ఏనాడు చేయలేదన్నారు. అందర్ని కలుపుకుపోయే ప్రయత్నం వైయస్ఆర్సీపీ చేసిందని తెలిపారు. రేపటి బంద్ను అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని ఆయన కోరారు.