<br/> హైదరాబాద్ : ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపేర్కొన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచటమే రాజీనామాల ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. రాజీనామాల ఆమోదం కోసం కూడా ఆలస్యం చేశారంటే వారు ఎంత బయపడుతున్నారో అర్ధం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవిశ్వాసం పెడతామంటే ఐదు మందితో ఏం పెడతారని నవ్విన విషయాన్ని గుర్తు చేశారు. అన్ని పార్టీలను కలిసి అవిశ్వాసం పెడితే దేశ వ్యాప్తంగా చర్చ జరిగిందన్నారు.