<br/><strong>-సమన్వయకర్త కాసు మహేష్రెడ్డి</strong><strong>- అక్రమ మైనింగ్ కేసులో సీబీఐతో విచారణ జరిపించాలని</strong><strong> </strong>గుంటూరు: గురజాలలో ఎమ్మెల్యే యరపతినేని మైనింగ్ అక్రమాలు బయటపెట్టే వరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదని, ప్రజా తిరుగుబాటు ఎలా ఉంటుందో త్వరలో చూపిస్తామని గురజాల వైయస్ఆర్సీపీ సమన్వయకర్త కాసు మహేష్రెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..గురజాలలో వైయస్ఆర్సీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటనను పోలీసులను అడ్డం పెట్టుకుని వాయిదా వేయగలిగారనీ, కానీ టీడీపీ నేతల అవినీతి బాగోతాన్ని బట్టబయలు చేసే ఉద్యమాన్ని ప్రభుత్వం ఆపలేదని తెలిపారు. మైనింగ్ అక్రమాలు వెల్లడైతే ప్రభుత్వం ఇరుకునపడుతుందని యరపతినేని వణికిపోతున్నారని అన్నారు. అందినకాడికి దోచుకున్న యరపతినేని మైనింగ్ కేసులో తన దగ్గర పనిచేసే డ్రైవర్, వాచ్మెన్, గుమాస్తాలను బాధ్యులను చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమ మైనింగ్ కేసులో సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మైనింగ్ మాఫియా నుంచి వసూలు చేసిన రెండువేల కోట్ల పెనాల్టీని పల్నాడు అభివృద్ధికి ఖర్చు చేయాలని అన్నారు. వైయస్ జగన్ సీఎం అయిన 6 నెలల్లో అక్రమ మైనింగ్ జరిగిన భూములను స్వాధీనం చేసుకుంటామని అన్నారు. <br/><br/>