కాకినాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని పార్టీ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు తెలిపారు. సీపీఎస్ ఉద్యోగులు చేపట్టిన ఆందోళనలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇదివరకే ప్రకటించారని తెలిపారు.