శ్రీకాకుళంః శ్రీకాకుళం జిల్లాలో వైయస్ జగన్ పాదయాత్ర సునామీ సృష్టిస్తోందని ధర్మాన ప్రసాదరావు అన్నారు.2019 ఎన్నికల్లో వైయస్ జగన్ విజయ సునామీ సృష్టిస్తారన్నారు.ఏపీని మరింత అప్పుల్లోకి చంద్రబాబు నెట్టారన్నారు.రాజధాని భూములను ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతున్నారన్నారు.ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు తెలియడం లేదన్నారు.ప్రభుత్వ జీవోలను రహస్యంగా దాచి పెడుతున్నారన్నారు.బాబు కుటుంబానికి ఆస్తులు పెరిగాయని,ఏపీకి అప్పులు మిగిలాయన్నారు.చంద్రబాబు అవినీతి బయటపడకూడదనే రాష్ట్రానికి సీబీఐ వద్దంటున్నారన్నారు.వైయస్ఆర్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొన్నారని,శ్రీకాకుళం జిల్లాలో ప్రాజెక్టులకు చంద్రబాబు నిధులు ఇవ్వడం లేదన్నారు.<br/>