విజయవాడ: సమ సమాజానికి అంబేద్కర్ కృషి చేశారని వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ అన్నారు. డాక్టర్ అంబేద్కర్ జయంతి రోజు సమ సమాజం ఉండాలని అందరు భావిస్తున్నారన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కు ఇకనైన ఈ ప్రభుత్వం కృషి చేయాలన్నారు. కృష్ణా జిల్లా ప్రజలు వైయస్జగన్కు ఘన స్వాగతం పలికారని, దుర్గమ్మ వారధిపై జనజాతర కనిపించిందన్నారు.