కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
మా రాజీనామాలతో బీజేపీకి కనువిప్పు
19 Jul 2018 12:26 PM
న్యూఢిల్లీ: వైయస్ఆర్సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసినప్పుడే బీజేపీ కళ్లు లె రిచిందని, అందుకే అవిశ్వాస తీర్మానానికి ఒప్పుకుందని మాజీ ఎంపీ వరప్రసాద్ అన్నారు. మా త్యాగఫలితంగానే కేంద్రం దిగి వచ్చిందన్నారు. మాతో పాటు టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి ఉండి ఉంటే ప్రత్యేక హోదా ఇప్పటికే వచ్చి ఉండేదన్నారు. మాట తప్పడం చంద్రబాబుకు సహజంగానే వచ్చిందన్నారు. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డికి టీడీపీ నాయకత్వంపై విశ్వాసం లేదేమో అని అనుమానం వ్యక్తం చేశారు. కడప ఉక్కు దీక్షలోనే ఉక్కు లేదు..తుక్కు లేదని అన్నట్లు గుర్తు చేశారు. నాలుగేళ్లు బీజేపీతో కలిసి పనిచేసిన టీడీపీకి విభజన చట్టంలోని అంశాలు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. మొదటిసారి ఎన్టీఆర్ పుణ్యంగా సీఎం అయిన చంద్రబాబు రెండోసారి అటల్ బిహారీ వాజ్పేయి సహకారంతో సీఎం అయ్యారు. మూడోసారి బీజేపీ, జనసేన సహకారంతో ముఖ్యమంత్రి అయ్యారని వివరించారు. ఇపుడు మళ్లీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని విమర్శించారు. ఏదోరకంగా ముఖ్యమంత్రి కావాలన్నదే చంద్రబాబు ఆలోచన అన్నారు. వైయస్ జగన్ ధైర్యంగా పోరాడుతారని, మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసిన యోధుడని పేర్కొన్నారు.