మైదుకూరులో వైయస్సార్సీపీ ధర్నా

వైయస్ఆర్ జిల్లాః కేసీకేనాల్ కు సాగునీరివ్వాలని డిమాండ్ చేస్తూ మైదుకూరులో వైయస్సార్సీపీ ధర్నా చేపట్టింది. కేసీ కెనాల్ కు వెంటనే కృష్ణా జలాలు విడుదల చేయాలని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి డిమాండ్ చేశారు. ధర్నాలో రఘురామిరెడ్డితో పాటు ఎమ్మెల్యేలు అంజాద్ బాష, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ధర్నాకు రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Back to Top