విజయవాడః నగరంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సాగిస్తున్న భూందాలు, దోపిడీలు, కాల్ మనీ సెక్స్ రాకెట్ వికృత క్రీడను ప్రజలంతా గమనిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. నగరంలో రౌడీల్లాగా వ్యవహరిస్తూ టీడీపీ నేతలు ఎవరిని లెక్కచేయకుండా గూండాయిజం చేస్తున్నారని మండిపడ్డారు. పచ్చచొక్కాలను ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాల్ మనీ బాధితులకు, మహిళలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. <br/>